Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ : కేసీఆర్ నిర్ణయం

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (08:47 IST)
ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెషన్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.
 
ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments