ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ : కేసీఆర్ నిర్ణయం

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (08:47 IST)
ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెషన్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.
 
ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)

Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్

Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు

Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి

Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్‌ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments