Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకం పట్టి గంటసేపైనా చదవమన్న తండ్రి.. కత్తెరతో గొంతు కోసిన కుమారుడు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:30 IST)
విద్యార్థులకు కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు జరిగినా చదువులకు చాలామంది విద్యార్థులు దూరంగా వున్నారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా వుంటూ పుస్తకం తాకని కుమారుడిని తండ్రి మందలించాడు. పుస్తకం పట్టి గంటసేపైనా చదువు అని మందలించాడు. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు పక్కనే ఉన్న కత్తెరతో తన తండ్రి మెడను పొడిచి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్​ గ్రామంలో బంటు ఎల్లయ్య(45), లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కొడుకు నాగేందర్(19), కూతురు భవాని. నాగేందర్ ​సూర్యాపేటలో ఇంటర్​ ​సెకండ్​ ఇయర్ ​చదువుతున్నాడు. నాగేందర్ కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్దదిగా మారింది. నాగేందర్ ​ఆవేశంలో కత్తెరతో తండ్రి గొంతులో పొడిచాడు.
 
ఎల్లయ్య అక్కడే రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే స్థానికులు వచ్చి ఎల్లయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments