Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ ఆరోగ్యం భేష్, కోవిడ్ లక్షణాలు పోయాయి: సీఎం వ్యక్తిగత వైద్యుడు

కేసీఆర్ ఆరోగ్యం భేష్, కోవిడ్ లక్షణాలు పోయాయి: సీఎం వ్యక్తిగత వైద్యుడు
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (21:52 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణ పరీక్షల కోసం సోమాజీగూడ లోని యశోధ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు అక్కడ పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్ చేసారు. ఈ పరీక్షల్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అంతా సవ్యంగానే వున్నట్లు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు తెలియజేశారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.
 
కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.
 
ఇక సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు పోయాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ కరోనాపై రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ