Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ కరోనాపై రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఏపీ కరోనాపై రేపు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:25 IST)
సెకండ్‌ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ ఇటు వైరస్‌బారిన పడుతున్నవారితో పాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు రేపు మంత్రివర్గ ఉససంఘం భేటీ కానుంది. మంత్రి ఆళ్ల నాని సారథ్యంలో రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్‌పై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య నిపుణుల నియామకం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆంక్షల విధింపు అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హమ్మ! రఘురామకృష్ణ విజయసాయిని ఎంత మాటనేశాడు?