బుధవారం ఉదయం వరకు ఆలయ దర్శనాలు బంద్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (15:53 IST)
సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 25వ తేదీ బుధవారం ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆలయంలో ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేశారు. 
 
26వ తేదీన నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చన సైతం నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని తెలిపారు. 
 
అలాగే సూర్యగ్రహణం కారణంగా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సైతం మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం ఉదయమే దర్శన భాగ్యం కల్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments