Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం - ఆరేళ్ల పాల అత్యాచారం

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:03 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. ఈ ప్రాంతంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటనతో బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలని రాత్రంతా ఆందోళనకు దిగారు.
 
గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులంతా గాలించారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. దీంతో అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. 
 
కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు.. రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.
 
జులాయిగా తిరిగే బాలరాజు... దొంగతనాలు చేస్తూ దుర్వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను తరచూ కొట్టేవాడు. నిత్యం కొడుతూ భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఒంటరిగా ఉండే అతగాడు.. సైకో చేష్టలపై అనుమానంతో వెళ్లి చూస్తే పాప మృతదేహం కనిపించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, సింగరేణికాలనీ వాసులు రగిలిపోయారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, చిన్నారి మృతదేహాన్ని తమకు ప్పగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments