Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఎకరం కూడా సాగు చేయడానికి వీల్లేదు : సిద్ధిపేట కలెక్టర్

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (12:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కలెక్టర్ స్థానిక రైతులకు ఓ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా, యాసంగిలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో ఒక్కఎకరా వరిసాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆదేశించారు. 
 
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై జిల్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, విత్తన డీలర్లలతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. 
 
వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా వరి సాగు చేస్తే రైతులదే బాధ్యత అని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments