Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ మర్డర్... తల్లిని, చెల్లిని చెరిచి చంపేస్తానన్నాడు.. అందుకే చంపేశా

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:26 IST)
వరుస హత్యలతో భాగ్యనగరం వణుకుతోంది. నడిరోడ్డుపై ప్రాణాలు తీస్తున్నా కాపాడే దిక్కే లేకుండా పోయింది. మొన్న ఎర్రగడ్డ, ఆ తర్వాత అత్తాపూర్ ఇప్పుడు పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఆటో డ్రైవర్ హత్య... షాకీర్ ఖురేషికు మరో ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖాజాకు మధ్య విబేధాలున్నాయ్. తన తల్లిని, చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తానని షాకీర్ చెప్పేవాడని.. దాంతో అతన్ని చంపేశానంటున్నాడు ఖాజా. 
 
నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ షాకీర్‌ను కిందపడేశాడు. ఆ వెంటనే కత్తితో అతని గొంతు కోసేశాడు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా చాలాసేపు కత్తితో వేట్లు వేస్తుండగా.. అక్కడ చూస్తున్న జనం ఎవరూ అడ్డుకోలేదు సరికదా.. తమ సెల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేయసాగారు. ఓ పోలీస్ వచ్చి ఖాజాను అడ్డుకునేందుకు యత్నించినా కత్తితో అతన్ని బెదిరించాడు. చేసేది లేక పోలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
 
కత్తి పోట్లతో రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు షాకిర్. హత్యకు గురైన షాకిర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. నిందితుడు ఖాజాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చాక పోలీసుల చేతుల్లో తుపాకులు కాదు కదా.. కనీసం లాఠీలు కూడా ఉండకపోవడంతో నేరస్తులు ఇలా రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments