Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..
, సోమవారం, 26 నవంబరు 2018 (14:28 IST)
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. ఇందు కోసం ఆరు నెలలుగా శవానికి పూజలు చేశాడు. కానీ చివరికి అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఇందిరాకాలనీకి చెందిన విశ్వనాథ్ ప్రసాద్  (75) కొద్దికాలం క్రితం అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు చేయకుండా.. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. 
 
ఇందుకోసం శవాన్ని రసాయనాలతో భద్రపరిచాడు. గత ఆరు నెలల పాటు తండ్రి శవం ముందు కూర్చుని పూజలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు తల్లి, సోదరి చెప్పినా వినిపించలేదు. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫస్ట్ క్లాస్‌కు నో హోంవర్క్.. ఏ క్లాస్‌కు ఎంత బరువు?