Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ పేటలోని దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:27 IST)
హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేటలో ఉన్న పురాతన దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. గత రాత్రి కూడా ఈ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు ఈ భవనం కూల్చివేత పనులు చేపట్టింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఈ కూల్చివేత పనులను మొదలుపెట్టారు.
 
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్ పేటలో ఈ దక్కన్ మహాల్ ఉంది. ఇటీవల ఈ ప్రమాదంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. పైగా, ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా, గత రాత్రి 11 గంటల నుంచి ఈ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు.
 
ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ రూ.33 లక్షలకు టెండర్లు దక్కించుకుంది. దీంతో భారీ జేసీబీతో గురువారం రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ భవనం ట్రేడర్స్ సిబ్బంది భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం