Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ పేటలోని దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:27 IST)
హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేటలో ఉన్న పురాతన దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. గత రాత్రి కూడా ఈ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు ఈ భవనం కూల్చివేత పనులు చేపట్టింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఈ కూల్చివేత పనులను మొదలుపెట్టారు.
 
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్ పేటలో ఈ దక్కన్ మహాల్ ఉంది. ఇటీవల ఈ ప్రమాదంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. పైగా, ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా, గత రాత్రి 11 గంటల నుంచి ఈ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు.
 
ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ రూ.33 లక్షలకు టెండర్లు దక్కించుకుంది. దీంతో భారీ జేసీబీతో గురువారం రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ భవనం ట్రేడర్స్ సిబ్బంది భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం