సెప్టెంబరు ఒకటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (20:03 IST)
తెలంగాణా రాష్ట్రంలో కూడా బడులు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. 
 
విద్యా సంస్థలను ఓపెన్ చేయడంపై సీఎం కేసీఆర్ సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు చర్చలు నిర్వహించిన సీఎం.. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
విద్యాసంస్థలు ప్రారంభించవచ్చని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యా సంస్థల పునః ప్రారంభం నేపథ్యంలో అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టిన సంగతి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments