నేటి నుండి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (15:12 IST)
లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో కడప, కర్నూలు, చిత్తూరు, రాజ మండ్రి, విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు వెళ్లే బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
 
ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  ఒప్పందంపై సంతకం జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.61 లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దపడిన విషయం తెలిసిందే.
 
ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని తెలిపారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు సమాచారాన్ని పంపించామని అన్నారు. బస్సులు నడవడం ప్రారంభం అయిన వెంటనే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments