నేటి నుండి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (15:12 IST)
లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో కడప, కర్నూలు, చిత్తూరు, రాజ మండ్రి, విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు వెళ్లే బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
 
ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  ఒప్పందంపై సంతకం జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.61 లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దపడిన విషయం తెలిసిందే.
 
ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని తెలిపారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు సమాచారాన్ని పంపించామని అన్నారు. బస్సులు నడవడం ప్రారంభం అయిన వెంటనే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa Bhosle: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా (video)

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

Kasarla Shyam: ఆయా షేర్ పాట తో లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారన్నారు : కాసర్ల శ్యామ్

Tammareddy: ఇండస్ట్రీ లో మనుగడ లేదు అనుకున్న టైంలో వదలా చిత్రం చేశా : తమ్మారెడ్డి

Sudigali Sudheer: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటోన్న సుడిగాలి సుధీర్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments