Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్ధమాన్‌ను పాకిస్థాన్ అందుకే విడుదల చేసింది.. ఎంపీపై దేశద్రోహం కేసు

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (14:54 IST)
భారత్‌ తమపై దాడి చేస్తుందని భయంతో వణికిపోయి.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్ విడుదల చేసిందని చెప్పిన ఎంపీ అయాజ్‌ సాధిఖ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజా షా తెలిపారు.
 
సాదిఖ్‌ను ద్రోహిగా పేర్కొంటూ లాహోర్‌లో గోడపత్రికలు సైతం వెలిశాయి. దీనిపై ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదుచేస్తోందని ఆరోపించింది.
 
మరోవైపు అభినందన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సాధిఖ్‌ ఉద్ఘాటించారు. తానెప్పుడూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. గతంలో జాతీయ భద్రత కమిటీకి అధిపతిగా వ్యవహరించిన తన వద్ద అనేక రహస్యాలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments