Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్ డాక్టర్ గంగాధర్: తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రశంస

Webdunia
బుధవారం, 14 జులై 2021 (21:28 IST)
రోడ్ల మీద ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చే పనిని స్వచ్ఛందంగా చేపట్టిన కే. గంగాధర్ తిలక్‌ను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్‌లో సత్కరించారు. ప్రమాదాలను నివారించడానికి, జీవితాలను కాపాడడానికి రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా చేసుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలం పైగా గంగాధర్ చేపట్టడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.
 
గంగాధర్‌ను "రోడ్ డాక్టర్"గా గవర్నర్ అభివర్ణించారు. గంగాధర్, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని గవర్నర్ అన్నారు. గంగాధర్‌ను, ఆయన భార్యను మన కాలం "అన్ సంగ్ హీరోస్"గా గవర్నర్ కొనియాడారు. రోడ్లపై జరుగుతున్న కొన్ని ప్రమాదాలను చూసి చలించిన గంగాధర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత దశాబ్ద కాలంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.
 
ఇంత వయసులో, ఇంత ఓపికగా, సొంత ఖర్చుతో రోడ్లపై గుంతలు పూడ్చడం ఒక ఉద్యమంగా చేపట్టిన గంగాధర్ దంపతులు అందరికీ స్ఫూర్తిదాయకం అని డాక్టర్ తమిళిసై అన్నారు.
 గవర్నర్ డాక్టర్ తమిళిసై ఈ దంపతులకు శాలువా, జ్ఞాపికలు బహూకరించి రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments