Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో మద్యం సేవిస్తూ వేగంగా కారు నడిపిన భక్తులు, ఆ తరువాత?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (21:03 IST)
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి మత్తుపదార్థాలను తీసుకెళ్ళకూడదు. ప్రత్యేకంగా టిటిడి ఇందుకోసం ఒక వింగ్‌ను ఏర్పాటు చేసింది. సొంత వాహనాల్లో వచ్చేవారు తిరుమలకు వెళ్ళాలంటే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం పరిశీలించి పంపిస్తుంటారు. 
 
ప్రతి భక్తుడి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అలాగే భక్తులు తన వాహనాన్ని దిగి స్కానింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అలాంటిది ఒక భక్త బృందం ఏకంగా దీన్ని తప్పించుకుని వెళ్ళడమే కాదు.. ఘాట్ రోడ్డు మొత్తం మద్యం సేవించారు. అంతటితో ఆగలేదు తమ కారును వేగంగా ఘాట్ రోడ్డుతో నడుపుతూ కనిపించారు. 
 
ఐజీ కారునే ఓవర్‌టేక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. నాగాలాండ్‌కు చెందిన ఒక భక్త బృందం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనికీ కేంద్రం నుంచి దాటుకుని రెండవ ఘాట్ రోడ్డులోకి ప్రవేశించారు. ఘాట్ రోడ్డులో వెళుతూ కారులోనే ఒక ఫుల్ బాటిల్ మద్యం, సిగరెట్లు, స్నాక్ తీసుకుని తాగుకుంటూ వెళ్ళారు.
 
మత్తులో అతివేగంగా కారును నడుపారు. ఘాట్‌లో వెళుతున్న ఐజీ కారునే ఓవర్ టేక్ చేశారు. దీంతో ఐజి అనుమానంతో తిరుమల జిఎన్‌సి టోల్‌గేట్‌లో సమాచారమివ్వమని ఆదేశించారు. టిటిడి విజిలెన్స్ అధికారులు వాహనాన్ని ఆపగా మత్తు పదార్ధాలు కనిపించాయి.
 
దీంతో భక్త బృందాన్ని ప్రశ్నించగా ఘాట్ రోడ్డులో, తిరుమలలో మద్యం సేవించకూడదని తమకు తెలియదంటూ భక్త బృందం క్షమాపణ చెప్పింది. దీంతో విజిలెన్స్ అధికారులు భక్త బృందానికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments