Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వరి దీక్ష : ఒకే వేదికపై రేవంత్ - కోమటిరెడ్డి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:44 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకుంది. ఇందులోభాగంగా, శనివారం నుంచి వరి దీక్షను చేపట్టింది. ఈ దీక్షను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టారు. ఇక్కడ విశేషమేమిటంటే.. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరిదీక్షకు ఆ పార్టీ నేతలంతా సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరూ హాజరయ్యారు. ఆ ఇద్దరూ ఆలింగనం చేసుకుని ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొన్నారు. 
 
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమిటిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం