Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో తొడగొట్టిన కాంగ్రెస్ - ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి?

తెలంగాణలో తొడగొట్టిన కాంగ్రెస్ - ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి?
, మంగళవారం, 23 నవంబరు 2021 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొడగొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఖమ్మంలో నాగేశ్వర రావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్, వరంగల్‌లో వేం వాసుదేవరెడ్డిలను బరిలోకి దించాలని భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అయితే, అభ్యర్థుల పేర్లను టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే, జిల్లా డీసీసీలకే పూర్తి నిర్ణయం కట్టబెట్టాలని భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండపల్లి ఎన్నికల్లో ఉద్రిక్తత - రెండో రోజూ వాయిదా