Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండపల్లి ఎన్నికల్లో ఉద్రిక్తత - రెండో రోజూ వాయిదా

Advertiesment
Krishna
, మంగళవారం, 23 నవంబరు 2021 (13:04 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తొలి రోజున ఎన్నిక జరుగకుండా అడ్డుకున్న అధికార వైకాపా నేతలు.. రెండో రోజైన మంగళవారం కూడా ఈ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదాపడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార వైకాపా సభ్యుల కంటే ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సభ్యుడు అదనంగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ గిరి టీడీపీకి దక్కుంది. అలా కాకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు ఎన్నిక జరుగకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకోవాలంటూ కోరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ల కన్నుసన్నల్లో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ ఎన్నిక సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాల్వాన్ లోయలో వీరమరణం : సంతోష్ బాబుకు మహావీర్ చక్ర