Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో తగ్గిన హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాలు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:26 IST)
కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుదల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జనసంచారం లేకపోవడం నేరాలు తగ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్రతీ వీధిలోనూ పోలీసు గస్తీ, నిఘా పెరగడం రెండో కారణం. 
 
అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్‌డౌన్‌ నిబంధనలను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వరకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి.
 
2018 నేషనల్‌ క్రైం బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. ఈ నేరాలను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టీ కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కేసుల్లో అధికశాతం లాక్‌డౌన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే.. రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 2.5 కేసులే నమోదయ్యాయి. 
 
2018 ఎన్‌సీఆ ర్‌బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది.
 
పదిరోజుల్లో 4,369 కేసులు.. 
డెకాయిటీ (1), రాబరీ (2), పగటి చోరీలు(2), రాత్రి చోరీలు (17), దొంగతనాలు (153), హత్యలు (14), అల్లర్లు (14), కిడ్నాప్‌లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హత్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సాధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి.

అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. 
రోడ్‌ సేఫ్టీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60 మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజుల్లో చిన్నాపెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదాలు వాహనదారుల స్వయంకృతాపరాధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం