Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. నిర్మల్‌ జిల్లాలో అత్యధిక టెంపరేచర్

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:19 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా, నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ యేడాది రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఇదేకావడం గమనార్హం. దీంతో అనేక ప్రాంతాల్లో పగటిపూట నిర్మానుష్యంగా కనిపిస్తుంది. మరో మూడు రోజులు ఇలానే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు మరీముఖ్యంగా, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 
 
కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జంబుగ, నల్గొండ జిల్లా కట్టంగూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పెద్దపల్లి జిల్లా ఈ తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 44.3 డిగ్రీలు, సూర్యాపేటలో 44 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణాలోని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నెల 19వ తేదీ తర్వా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments