Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాచుకున్న డబ్బులతో అక్కకు తమ్ముడి తులాభారం

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (14:35 IST)
రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు తాను దాచుకున్న డబ్బుతో అక్కకు తులాభారం నిర్వహించాడు. ఇది అక్కా తమ్ముళ్లకు మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఆత్మీయ పండుగగా జరుపుకుంటున్నారు. ఈ రాఖీ పండుగను పురస్కరించుకుని తమ్ముడికి అక్క రాఖీ కట్టింది. దీంతో అక్కకు తన వంతు సాయంగా దాచుకున్న డబ్బుతో రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన అక్కకు తులాభారం చేశాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన ఖమ్మం జిల్లాలోని శ్రీశ్రీ సర్కిల్‌కు చెందిన బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతుల ఇంట జరిగింది. 
 
ఈ దంపతులకు రణశ్రీ, త్రివేది అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రణశ్రీకి గత యేడాది వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన తొలి రాఖీ పండుగ అక్కకు జీవితాంతం ఉండిపోవాలని భావించాడు తమ్ముడు. తన కొడుకు అక్కపై ఇంత అభిమానాన్ని చూపడం కోసం తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బును ఐదు రూపాయల నాణేలుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు. 
 
ఈ తులాభారంలో 11200 ఐదు రూపాయల కాయిన్స్ తూకంగా వేశాడు. వాటి విలువ రూ.56 వేల రూపాయలు. వీటిని కానుకగా ఇచ్చారు. ఈ తులాభార వేడుకకు తమ బంధువులు, స్నేహితులు పిలిపించుకుని ఘనంగా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments