Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావిలో బాలుడు మృతిపై హెచ్ఆర్సిలో పిటిషన్

Webdunia
గురువారం, 28 మే 2020 (21:35 IST)
మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు వర్ధన్ బోరు బావిలో పడి చనిపోయిన ఘటనలో రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సిలో పిటిషన్ దాఖలు చేసింది.
 
బోరు బావుల్లో పిల్లలు పడటం, యంత్రాంగం అంతా చేరి పిల్లలను పైకి తీసే ప్రయత్నం చేయడం, చివరకు పిల్లల శవాలే పైకి తేవడం ప్రహసనంగా మారిందని బోరు బావికి అనుమతి ఇచ్చే అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి ఆ బోర్ విఫలమైతే దానిని వెంటనే మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
 
పనికిరాని బోరుబావులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బోరు బావి వేసే రిగ్ యజమానులు సైతం నిరర్థక బోరు బావుల మూసివేతలో విఫలమౌతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments