బోరు బావిలో బాలుడు మృతిపై హెచ్ఆర్సిలో పిటిషన్

Webdunia
గురువారం, 28 మే 2020 (21:35 IST)
మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు వర్ధన్ బోరు బావిలో పడి చనిపోయిన ఘటనలో రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సిలో పిటిషన్ దాఖలు చేసింది.
 
బోరు బావుల్లో పిల్లలు పడటం, యంత్రాంగం అంతా చేరి పిల్లలను పైకి తీసే ప్రయత్నం చేయడం, చివరకు పిల్లల శవాలే పైకి తేవడం ప్రహసనంగా మారిందని బోరు బావికి అనుమతి ఇచ్చే అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి ఆ బోర్ విఫలమైతే దానిని వెంటనే మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
 
పనికిరాని బోరుబావులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బోరు బావి వేసే రిగ్ యజమానులు సైతం నిరర్థక బోరు బావుల మూసివేతలో విఫలమౌతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments