Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, స్వామివారి దర్శనం ఎప్పటి నుంచో తెలుసా?!

Webdunia
గురువారం, 28 మే 2020 (21:08 IST)
ఈ నెల 31వ తేదీన లాక్‌డౌన్ ఎత్తేసి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లని పరిశీలించారు టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి. 
దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా శ్రీవారి సేవకులతో పర్యవేక్షణ కొనసాగుతుందని టిటిడి పాలకమండలి ఛైర్మన్ చెప్పారు. ఎక్కడికక్కడ మైకుల ద్వారా కరోనా గురించి అప్రమత్తం చేయనున్నామన్నారు. క్యూలైన్లో ప్రతి భక్తుడికీ భక్తుడికీ మధ్య ఆరడుగుల దూరం ఖచ్చితంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
రోజుకి ఏడువేల మందిని పంపే ఆలోచనలో టిటిడి ఉంది. గతంలో 60 నుంచి 80వేల మంది భక్తులు స్వామివారిని దర్సించుకునేవారు. శని, ఆదివారాల్లో అయితే ఆ సంఖ్య లక్షకు పైగా ఉండేది.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో భక్తుల సంఖ్యను తగ్గించేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లు, చేతులకి గ్లౌజులతో దర్సనానికి రావాలనేది తప్పనిసరి చేస్తున్నారు. అయితే వైరస్ ప్రభావంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా లేదని టిటిడి అధికారులే అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments