Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లండి: కాప్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:56 IST)
కోవిడ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు గుంజుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి చనిపోయాక కూడా బిల్లు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని మొండికేస్తున్నాయి. 
 
తాజాగా మేడ్చల్ జిల్లాలోని నాగరం మునిసిపాలిటీలోని రాంపల్లికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు వాసు ఐదు రోజుల క్రితం కరోనావైరస్‌తో బాధపడుతూ కాప్రాలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఐదు రోజులుగా అతడి చికిత్స కోసం లక్షన్నర రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. ఐతే అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం నాడు కన్నుమూశాడు.
 
దీనితో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. ఐతే మరో రెండు లక్షలు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గం చెప్పింది. చనిపోయిన తర్వాత బిల్లు ఎందుకు కట్టాలంటూ మృతుడి బంధువులు నిలదీశారు. డబ్బు కట్టి తీసుకెళ్లండి, వాగ్వాదం వద్దని వాసు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనితో అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో నిరసనలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments