Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. 4000 కోవిడ్ కేర్ కోచ్‌ల ఏర్పాటు

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (18:08 IST)
కోవిడ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని ఆస్పత్రుల్లో చేరడానికి వణికిపోతున్నారు ప్రజలు.. అయితే, కోవిడ్ బాధితులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
 
దాదాపు 4000 కోవిడ్ కేర్ కోచ్‌లను ఏర్పాటు చేసింది.. ఈ కోచ్‌ల ద్వారా దాదాపు 64 వేల పడకలు సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్‌పూర్, భోపాల్, తిహి కోసం కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే సమీకరించింది.
 
నాగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్, నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మధ్య 11 కోవిడ్ కేర్ కోచ్‌ల కోసం ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments