Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఆన్‌లైన్ బడులు

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:30 IST)
తెలంగాణా రాష్ట్రంలో గురువారం నుంచి ఆన్‌లైన్ బడులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెబుతారు. రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 
 
ఈ ఆన్‌లైన్‌ తరగతులను టీ-శాట్‌, దూరదర్శన్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ గురువారం నుంచే ప్రారంభిస్తున్నారు.
 
మరోవైపు, ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకూ ఆన్‌లైన్‌ ద్వారానే బోధన జరుగుతుంది. ఇంటర్‌ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
ఈ 50 శాతం ఉపాధ్యాయులు వారి బడి పరిధిలోని విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments