Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఆన్‌లైన్ బడులు

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:30 IST)
తెలంగాణా రాష్ట్రంలో గురువారం నుంచి ఆన్‌లైన్ బడులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెబుతారు. రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 
 
ఈ ఆన్‌లైన్‌ తరగతులను టీ-శాట్‌, దూరదర్శన్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ గురువారం నుంచే ప్రారంభిస్తున్నారు.
 
మరోవైపు, ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకూ ఆన్‌లైన్‌ ద్వారానే బోధన జరుగుతుంది. ఇంటర్‌ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
ఈ 50 శాతం ఉపాధ్యాయులు వారి బడి పరిధిలోని విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments