Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీ టీమ్స్‌కి చెప్పిందని కసి... యువతిని నడిరోడ్డుపై నరికిన ప్రేమోన్మాది...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:15 IST)
మహిళలపై దాడుల పరంపర సాగుతూనే ఉంది. ఓ కాలేజీ విద్యార్థినిపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో నడిరోడ్డులో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ప్రేమోన్మాదిగా మారిన ఒక యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది.
 
వివరాలలోకి వెళ్తే, కాచిగూడ పరిధిలోని సత్యనగర్‌లో ఉంటున్న మధులిక స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చదువుకుంటోంది. ఎదురింట్లో ఉండే భరత్ ప్రేమించాల్సిందిగా ఆమె వెంటపడేవాడు. మధులిక అతని గురించి తల్లిడండ్రులకు చెప్పగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసారు. తర్వాత వారు కౌన్సెలింగ్ ఇచ్చిన కూడా అతనిలో మార్పు రాలేదు. తనపై ఫిర్యాదు చేసారన్న అక్కసుతో మరింత రెచ్చిపోయాడు.
 
ఈ రోజు ఉదయం కాలేజీకి వెళ్తున్న మధులికను ఫాలో అయ్యి, తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసాడు. దాడిలో ఆమెకు మెడపై తీవ్రంగా గాయమై రక్తస్రావమైంది, నాలుగు వేళ్లు కూడా తెగిపోయాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments