Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియురాలు తిట్టిందనీ... ఆటోలోనే నిప్పంటించుకున్న ప్రియుడు

ప్రియురాలు తిట్టిందనీ... ఆటోలోనే నిప్పంటించుకున్న ప్రియుడు
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:18 IST)
ప్రియురాలు తిట్టందన్న కోపంతో ప్రియుడు ఆటోలోనే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఢిల్లీలోని జ్యోతి నగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన శివమ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన బంధువైన అర్జున్‌తో కలిసి వెళ్తుండగా మార్గమధ్యంలో మరో వృద్ధుడు ఆటో ఎక్కాడు. ఆటో కొద్ది దూరం వెళ్లింది. ఇంతలో శివమ్ కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు.
 
వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయో తెలియదు కాదనీ... ఇద్దరూ ఫోనులోనే వాదులాడుకున్నారు. కోపంతో ఫోన్ కట్ చేసిన శివమ్ ఆటోను రోడ్డుపై నిలిపి వేశాడు. అనంతరం పెట్రోల్ బాటిల్ తీసి ఆటోలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ఆ మంటలు ఆటోలో ఉన్న మిగిలిన ఇద్దరికి కూడా అంటుకున్నాయి. 
 
ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు మంటలను ఆర్పి గాయపడిన ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా, శివమ్‌ శరీరం 70 శాతం కాలిపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఇద్దరు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివమ్ ఆత్మహత్యాయత్నంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపిల్, శామ్‌సంగ్‌కు చుక్కలు చూపిస్తున్న జియోమీ.. ఎలా?