Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ మెట్రో

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (20:06 IST)
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 25వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మెట్రో రైల్ సర్వీసులను అర్థరాత్రి వరకు నడపాలని నిర్ణయించింది. 
 
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో సిటీ బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో మెట్రో రైల్ సర్వీసులు నడపాలని హెచ్ఎంఆర్‌సీ నిర్ణయించింది. ఈ రైళ్లను కూడా క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెంచే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments