Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస పవర్ ముందే కనిపెట్టిన జూ.ఎన్టీఆర్-కల్యాణ్ రామ్... అందుకే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:51 IST)
కూకట్ పల్లి. ఆంధ్రులు ఎక్కువగా వుండే ప్రాంతమది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇప్పించి బరిలో దింపారు. కానీ సుహాసిని ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. సుహాసిని గెలుపు కోసం అటు బాలయ్య ఇటు చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఆమెను వెంటబెట్టుకుని ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఓటర్లు మాత్రం తెరాస వైపు మొగ్గారు. దీనితో సుహాసినికి పరాజయం తప్పలేదు. 
 
ఇకపోతే అక్కయ్య సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ ప్రచారం చేయలేదు. దీనిపై ఎంతోమంది విమర్శనాస్త్రాలు సంధించినా పట్టించుకోలేదు. ఇలా చేసి తెలివిగా వ్యవహరించారని ఇప్పుడు అంతా అనకుంటున్నారు. అలా కాకుండా తెరాసకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసి వున్నట్లయితే కేసీఆర్ వ్యతిరేకులుగా ముద్రపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా అయింది. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస గాలి వీస్తోందని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పసిగట్టేశారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments