Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ మృతి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (20:07 IST)
మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్‌ విఠల్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

బీపీఆర్‌ విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్‌, కుమారులు సంజయ్‌ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంజయ్‌ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments