ఎంసెట్‌లో ఇంటర్ మార్కులు వెయిటేజీ ఎత్తివేత

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (09:37 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేసింది. దీంతో ఇకపై ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులను కేటాయించనుంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చారు. ఇపుడు దీన్ని తొలగిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రద్దు వెనుక అనేక కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
 
అందువల్ల ఇకపై ఇంటర్ మార్కులతో ఎలాంటి సంబంధం లేకుండా ఎంసెట్ మార్కులను కేటాయించనున్నారు. ఎంసెట్‌‍లో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, జేఈఈ మెయిన్, నీట్‌సోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించిన విషయం తెల్సిందే. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే, ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయడం లేదు. ఒక వేళ  విడుదల చేసినా ఎంసెట్ అధికారులకు ఆయా బోర్డులో అందజేయడం లేదు. 
 
దీంతో వెయిటేజీ మార్కుల ఆధారంగా ర్యాంకుల కేటాయింపు సమస్యగా మారింది. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించారు. కాగా గత 2020 నుంచి 2022లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వలేదు. ఇపుడు దీన్ని శాశ్వతంగా తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments