Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గులాబీ కారెక్కారు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:53 IST)
ఎంపీ కవిత కారెక్కారు... ఇందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా... కారెక్కడమంటే ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కాదు. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా నామిషన్ వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె కారును నడిపారు. గులాబి రంగు అంబాసిడర్ కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత గాని అక్కడి ఉన్న నాయకులకు అర్థం కాలేదు.. కవిత గారు కారు నడపబోతున్నారని. 
 
గణేష్ అన్నా కారెక్కండి అనగానే గణేష్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. ఇంకేముంది బిగాలా ఇంటి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ కారు వేగం పెంచారు. వాహనదారులు సైతం ఎంపి కవిత డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. 
 
మీడియా ప్రత్యేక వాహనంలో ఎంపీ కవితను ఫాలో అయ్యారు. మొత్తానికి నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ అభ్యర్థిగా బీగాల గణేష్ గుప్తా చేత నామినేషన్ వేయించేందుకు కారులో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు ఎంపీ కవిత స్వయంగా తీసుకుని వెళ్ళడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments