Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్సేపై సానుకూల వ్యాఖ్యలు.. నాగబాబుపై ఠాణాలో ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 మే 2020 (21:57 IST)
జాతిపిత మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేపై సానుకూల వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. జాతిపితను కించపరిచేలా, గాడ్సే దేశ భక్తిని పొగుడుతూ వ్యాఖ్యలు చేసిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. 
 
గాడ్సే పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఇందులో "గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశమేనని, కానీ అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి లోబడి ఆనాడు మీడియా పనిచేసిందని" వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి దారి తీశాయి. అయితే తన ట్వీట్‌పై నాగబాబు వివరణ ఇచ్చుకున్నా... జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నాగబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇపుడు నాగబాబుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అందులో నాగబాబుపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పైగా, అతి తెలివితో మెగాస్టార్‌గా ఉన్న మీ అన్నకు చెడ్డపేరు తీసుకునిరావొద్దంటూ నాగబాబుకు కాంగ్రెస్ నేతలు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments