Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలాగూడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

Webdunia
బుధవారం, 11 మే 2022 (18:48 IST)
లాలాగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. హత్యకు గురైన వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 
 
హత్యకు గురైన వ్యక్తి 2017లో జరిగిన హత్యకేసులో  ప్రధాన నిందితుడు (అఫ్సర్‌)గా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఇకపోతే.. బంజారాహిల్స్‌‌లో కూడా ఓ హత్య సంచలనం సృష్టించింది. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్‌కు చెందిన మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ చింటూ(25) ప్లంబర్‌. రెండేండ్ల క్రితం ఓ చోరీ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి జైల్లో మహ్మద్‌ అమీర్‌(22)తో పరిచయం ఏర్పడింది. 
 
జైలు నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తుండేవారు. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఆటోలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి వచ్చి అర్థరాత్రి దాకా మద్యం సేవించారు. 
 
మద్యం మత్తులో గొడవ పడడంతో అమీర్‌ తన వద్ద ఉన్న బీర్‌బాటిల్‌తో ఒమర్‌పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి జకీరాబేగం ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments