Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాగ్యనగరిలో వరుస హత్యలు - బీరు బాటిల్స్‌తో పొడిచి హత్య

murder
, మంగళవారం, 10 మే 2022 (15:01 IST)
భాగ్యనగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో వరుస హత్యలు జరగడం ఇపుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తీసుకున్న ఓ వ్యక్తిని బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. ఈ హత్య హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లో అర్థరాత్రి జరిగింది. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. 
 
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతుడి వివరాలు తెలియాల్సివుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ హత్య మద్యం మత్తులో జరిగివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అరెస్టు : అచ్చెన్న