Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ నడిపేటపుడు నా కుమారుడు హెల్మెట్ ధరించి వుంటే..: కొడుకు శవం పక్కనే హెల్మెట్‌తో తండ్రి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (10:03 IST)
జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో తన కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్‌ వినియోగంపై ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కదిలించింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన 18 ఏళ్ల తేజావత్ సాయి తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 
అంతిమ యాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. అంతటి బాధలోనూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలని నిశ్చయించుకున్నాడు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ఆ రోజు ఈ హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ చెప్పాడు.

 
“నాలాగా ఏ బిడ్డను ఇలా కోల్పోకూడదు. బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి”. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ఇలాంటి సందేశం చెప్పి, హెల్మెట్ ధరించాలని హరి చెప్పడాన్ని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments