టీచర్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్.. ప్రత్యేక బస్సు సౌకర్యం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (17:29 IST)
మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేసింది. ఆర్టీసీ ఎండీ దీనిపై తక్షణమే స్పందించి బస్సు సౌకర్యం కల్పించారు. 
 
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూలుకు దాదాపు 200 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం వేళలో చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు రావడానికి బస్సులు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఇదే మార్గంలో ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్న కోటపల్లి కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల సమస్యలను వీడియో తీసి ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్.. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. టీచర్ భారతి, మోడల్ స్కూల్ విద్యార్థులు సజ్జనార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments