పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 16 యేళ్ల బాలిక.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో అభంశుభం తెలియని 16 యేళ్ళ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ మైనర్ బాలిక బలవ్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ ఓ యువకుడు నమ్మించి శారీరకంగా కలిశాడు. దీంతో ఆ యువతి గర్భందాల్చింది. 
 
ఈ విషయం తెలిసిన యువకుడు ఆ యువతికి ముఖం చాటేసాడు. ఈ క్రమంలో ఆ మైనర్ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత దుర్గం చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో శిశువును బాధితురాలు వదిలేసింది.
 
అనంతరం బాధితురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. బావిలో నుండి మృతదేహన్ని వెలికితీసి పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ముళ్ల పొదల్లో ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 
 
ఆంబులెన్స్‌లో ఆ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments