Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు..

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:31 IST)
తాలిబన్ల ఆప్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వుంటున్నా వారి అరాచకాలకు బ్రేక్ పడటం లేదు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగ్గానే కాబూల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకున్నారు. తాజాగా మంగళవారం ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యావత్ ప్రపంచం వీరి ఆగడాలకు హడలిపోతుంది. అఫ్గాన్‌ను విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం వదిలేసిపోయింది. అందులో హెలికాప్టర్ కూడా ఉండటంతో దానితోనే తాలిబన్లు కాందహార్‌లో విహరించారు.
 
ఆ హెలికాప్టర్‌కు వ్యక్తిని తాడుతో వేలాడదీసి గాల్లో ఎగురుతున్న వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అది మృతదేహమేనని, చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా తప్పిదమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్య దళాలు హడావుడిగా నిష్క్రమించాయి. తాము వెళ్లేముందే అక్కడున్న ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశామని పేర్కొన్నప్పటికీ.. సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments