శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు..

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:31 IST)
తాలిబన్ల ఆప్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వుంటున్నా వారి అరాచకాలకు బ్రేక్ పడటం లేదు. అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగ్గానే కాబూల్‌ ఎయిర్‌పోర్టును ఆక్రమించుకున్నారు. తాజాగా మంగళవారం ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి కాందహార్‌లో విహరించారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యావత్ ప్రపంచం వీరి ఆగడాలకు హడలిపోతుంది. అఫ్గాన్‌ను విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం వదిలేసిపోయింది. అందులో హెలికాప్టర్ కూడా ఉండటంతో దానితోనే తాలిబన్లు కాందహార్‌లో విహరించారు.
 
ఆ హెలికాప్టర్‌కు వ్యక్తిని తాడుతో వేలాడదీసి గాల్లో ఎగురుతున్న వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అది మృతదేహమేనని, చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా తప్పిదమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్య దళాలు హడావుడిగా నిష్క్రమించాయి. తాము వెళ్లేముందే అక్కడున్న ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశామని పేర్కొన్నప్పటికీ.. సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments