బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన సభ - 283 మందికి ఆహ్వానం

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (12:29 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇపుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ఆవిర్భవించనుంది. ఇందుకోసం తెరాస సర్వసభ్య సమావేశం జరనుంది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి 283 మంది ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇలాంటి వారిలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, తమిళనాడులోని డీపీఐ నేత తోల్ తిరుమావలవన్ తదితరులు ఉన్నారు. 
 
హైదరాబాద్ నగరంలో ఉన్న తెరాస ప్రధాన కార్యాలయం ఇందుకు వేదికకానుంది. తెరాస చీఫ్ కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో తెరాస పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. సర్వసభయ సమావేశానికి మొత్తం 283 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపడుతారు. ఆ తర్వాత తెరాస భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రకటన చేస్తారు. 
 
ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమాళవన్ హాజ‌ర‌వుతారు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో స‌మావేశమయ్యారు. 
 
కుమార‌స్వామితో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు ఆయ‌న వెంట వ‌చ్చారు. తిరుమాళవన్‌ ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చారు. వీరితో క‌లిసి సీఎం కేసీఆర్ అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అతిథులకు సీఎం కేసీఆర్ స్వయంగా అల్పాహారం వడ్డించారు. మ‌రోవైపు జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్య‌లో నగరానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments