Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఫోక్‌ సింగర్‌ గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (09:27 IST)
Sai Chand
తెలంగాణ ఫోక్‌ సింగర్‌, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ కన్నుమూశారు. గుండెపోటుతో అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నాగర్‌కర్నూల్ గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 
 
అప్పటికే సాయిచంద్‌ చనిపోయినట్లు కేర్‌ వైద్యులు ప్రకటించారు. మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా ఇతర ప్రముఖ నేతలు ఇప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయం తరలించాలని భావిస్తున్నారు.
 
తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకాలపై ఎన్నో పాటలను రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments