Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (15:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 8 నుంచి 9 డిగ్రీల మేరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణాలో శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 
 
కాగా, జనవరి నెలాఖరులో కూడా ఇంతటి కనిష్ట స్థాయిలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి శీతల గాలులు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వీస్తుండటం వల్లే చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments