Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కొడుకు ఒక్కడే.. అయితే వధువులు ఇద్దరు... ఒకేసారి పెళ్లి

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (15:43 IST)
పెళ్లి కొడుకు ఒక్కడే అయితే వధువులు మాత్రం ఇద్దరు. పెళ్లి ముహూర్తం కూడా ఒక్కటే. ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టి పెళ్లి చేసుకోనున్నాడు ఓ వ్యక్తి. ఈ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. పెళ్లి పత్రికలు కూడా సిద్ధమయ్యాయి. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నట్లు వెడ్డింగ్ కార్డులో కనిపిస్తుంది. 
 
కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప సత్యనారాయణ, రుక్మిణి దంపుతుల కుమార్తె సునీతలను సత్తిబాబు పెళ్లాడనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటుండటంతో ఇది వైరల్‌గా మారింది. 
 
వీరిద్దరినీ ప్రేమించిన సత్తిబాబు వారిని ఒకేసారి పెళ్లి చేసుకోనున్నాడు. బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా  వీరి వివాహం జరుగనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments