Publish Date: Wed, 08 Mar 2023 (15:00 IST)
Updated Date: Wed, 08 Mar 2023 (15:48 IST)
తెలంగాణలో నవీన్ హత్య కేసులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అబ్ధుల్లాపూర్మెంట్లో జరిగిన ఈ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక రెడ్డి, స్నేహితుడు హాసన్ పోలీసులు దర్యాప్తు చేసి వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 17న నవీన్ హత్య కేసులో అబ్దుల్లాపూర్ మెట్ ఫిబ్రవరి 24న హరిహరకృష్ణ లొంగిపోయాడు. పోలీసుల దర్యాప్తులో హత్య కేసులో నిహారిక, హాసన్ కూడా కీలక పాత్ర పోషించారని వెల్లడైంది.
ఈ కేసులో ఏ1 గా హరిహర కృష్ణ, ఏ2 గా హసన్, ఏ3గా నిహారికగా కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులకు హయత్నగర్ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.