Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ తిన్న యువకుడు రక్తం కక్కుకుని మృతి

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:29 IST)
ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిన్న యువకుడు ఆ వెంటనే రక్తం కక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండా వాసి ప్రసాద్(23) ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తిన్నాడు.
 
అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి వాంతులు వచ్చాయి. రక్తం కూడా నోట్లో నుంచి పడడంతో ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రసాద్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 
 
మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్కడి ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments