Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ బిర్యానీ ఆరగించిన యువకుడికి రక్తపు వాంతులు

Advertiesment
చికెన్ బిర్యానీ ఆరగించిన యువకుడికి రక్తపు వాంతులు
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ ఆరగించిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్న‌రావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండా వాసి ప్ర‌సాద్(23) అనే యువకుడు అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి దాన్ని పుష్టిగా ఆరగించాడు. 
 
అయితే రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే అతనికి వాంతులతో పాటు ర‌క్తం కూడా నోట్లో నుంచి ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వెంట‌నే ప్ర‌సాద్‌ను క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే ప్ర‌సాద్ మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్క‌డి ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా దాఖలు చేసిన మంత్రి కేటీఆర్