Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ ఆరగించిన యువకుడికి రక్తపు వాంతులు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ ఆరగించిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్న‌రావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండా వాసి ప్ర‌సాద్(23) అనే యువకుడు అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి దాన్ని పుష్టిగా ఆరగించాడు. 
 
అయితే రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే అతనికి వాంతులతో పాటు ర‌క్తం కూడా నోట్లో నుంచి ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వెంట‌నే ప్ర‌సాద్‌ను క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే ప్ర‌సాద్ మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్క‌డి ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments