Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ప్రాణం తీసింది.. మెట్టెలు, పుస్తెలతాడును చూసి..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:09 IST)
ప్రేమ ప్రాణం తీసింది. ప్రేమికుడిని వివాహం చేసుకుని.. ఒంటరిగా ఇంటికొచ్చిన ఓ యువతిని తల్లిదండ్రులు దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంకా గుట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మందలించడంతో ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వరికుప్పల శ్రీను-సుజాత కూతురు రూప(21) హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతూ అక్కడే నాంపల్లి మండలం మల్లరాజుపల్లి గ్రామానికి చెందిన సత్యంను ప్రేమించింది. సత్యం తల్లిదండ్రులు వీళ్ల పెళ్లికి నిరాకరించడంతో గుట్టుగా వివాహం చేసుకుని ఇటీవల స్వగ్రామంలో జరిగిన పండుగకు వచ్చారు. 
 
సత్యం తల్లిదండ్రులు దూషించడంతో ఒంటరిగా నేరేడుగొమ్ములోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మెట్టెలు, పుస్తెలతాడును చూసి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments