Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ డోంట్ కేర్, కూతురు పుట్టినరోజును ఘనంగా చేసిన పోలీసు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:47 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలెవ్వరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఎలాంటి శుభ కార్యాలు చేయొద్దని చెప్పిన ప్రభుత్వం, ఆఖరికి ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలను కూడా రద్దు చేసింది.
 
కానీ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీసులు మాత్రం అవన్నీ మాకు వర్తించవు అంటున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టెంట్లు వేసి మరీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మేకలను కోసి దావత్ చేసుకున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి వేడుకలు నిర్వహించారు.
 
వివరాల్లోకి వెళితే గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ కూతురి పుట్టిన రోజు ఈ రోజు. దాంతో స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్‌లో రెండు టెంట్లు వేసి, మండలం లోని అందరు సర్పంచ్‌లతో పాటు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే చితక బాడుతున్న గుండాల పోలీసులు, తాము మాత్రం చట్టాన్ని ధిక్కరించి ఇలా వేడుకలు చేయడం ఏమిటని, చట్టాలు పోలీసులకు వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments